మాంసాహారాలు లాంటి వేటమాంసం,పక్షి మరియు చేపలలో మంచి నాణ్యమైన మాంసకృత్తులు లభిస్తాయి,అదే విధంగా బి విటమిన్లు కూడా కలిగియుంటాయి. శాఖాహారం లో లేని బి12 మాంసాహారంలో ఉండటం ఒక ప్రత్యేకత. మాంసాహారంలో కాలేయం ద్వారా విటమిన్ ఎ లభిస్తుంది. మాంసాహారములోని మూడుప్రధాన సమూహాలు.గుడ్డు,మాంసం,చేపలు గుడ్లు ఒకపెద్ద గుడ్డు రమారమి 56గ్రాముల బరువు ఉంటుంది.గుడ్డులో 12శాతం గుడ్డుపెంకు,58శాతం తెల్లసొన,మిగిలినది పచ్చసొన.ఒక్కొక్క గుడ్డు సుమారు 80 క్య్తాలరీలనిస్తుంది. గుడ్డుతెల్లసొనలో ఎక్కువభాగం నీరు,ఇందులో ఎలాంటి కొవ్వుగానీ,పిండిపదార్ధాలు గానీ ఉండవు,కానీ 8-12శాతం వరకూ మాంసకృత్తులుంటాయి.గుడ్డుపచ్చసొనలో 25-33శాతంవరకూ కొవ్వు,15-17 శాతంవరకూ మాంసకృత్తులు మిగిలినదంతా నీరు.గుడ్డుపెంకు కాల్షియం కార్బనేటు తో తయారవుతుంది.ఖనిజాలు,విటమిన్లు రెండూ గుడ్డులో కలిసిపోయుంటాయి. గుడ్ల యొక్క పోషకాహార విలువ తేమ (గ్రా/%) 72.4 మాంసకృత్తులు (గ్రా/%) 13.3 కొవ్వు (గ్రా/%) 13.3 ఖనిజాలు (గ్రా/%) 1 శక్తి(కె కాల్) 173 కాల్షియం (మి గ్రా) 60 భాస్వరం (మి గ్రా) 220 ఇనుము (మి గ్రా) 2.1 విటమిన్ ఎ (మైక్రోగ్రాము) 360 థియామైన్ (మి గ్రా) 0.1 రిబోఫ్లోవిన్ (మి గ్రా) 0.4 నియాసిన్ (మి గ్రా) 0.1 ఫాలిక్ యాసిడ్ (మైక్రోగ్రాము) 78.3 గ్రుడ్డు మాంసకృత్తులు గ్రుడ్డు మాంసకృత్తులు మంచి నాణ్యత గలవి ఎందుకనగా అందులో ఆవశ్యకమైన అమినో ఆసిడ్స్ అన్నీ లభిస్తాయి రెండు గ్రుడ్డు రమారమి వందగ్రాముల బరువుంటాయి,అవి ఒక వయోజనుడైన మగవానికి ఒక రోజుకి ఎంతమాంసకృత్తుల అవసరం ఉంటుందో అందులో పాతికశాతాన్ని సమకూరుస్తాయి. గ్రుడ్డులోని క్రొవ్వు భాగాలు గ్రుడ్డులోని పచ్చసొన మాత్రమే క్రొవ్వు కలిగి ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది మరియు దేహానికి లభ్యమవుతుంది. గ్రుడ్డు ఒక సంపూర్ణ అహారం,కానీ రక్తంలో క్రొవ్వు శాతం(కొలెస్టారాల్) అధికంగా ఉన్నవారు పచ్చసొనను తొలగించి తినటం మంచిది. గ్రుడ్లలో విటమిన్లు,ఖనిజాలు ముఖ్యమైన ఖనిజాలు కాల్షియం,భాస్వరం,ఇనుము,జింకువంటి ఇతర ఛాయామూలకాలుగ్రుడ్డులో లభ్యమవుతాయి.పాల లాగానే గ్రుడ్లు కూడా ఐరన్ తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు - గుడ్లు వండేందుకు ముందుగా గుడ్డును శుభ్రంగా కడగాలి.తద్వారా గుడ్డుపెంకు మీదుండే సల్మానెల్లా బాక్టీరియా నాశనమౌతుంది. పగిలిన గుడ్లను పారెయ్యాలి. పచ్చి గుడ్లను వినియోగించకూడదు.ఎందుకనగా పచ్చిగుడ్లలో అవిడిన్ అనే ఒక యాంటీ-బైయోటిన్(నీటిలో కరిగే విటమిన్)కారకం ఉంటుంది. గుడ్లను వేడిచేస్తే ఈ సత్వం నాశనమౌతుంది. చేప చేప మాంసకృత్తులు,కాల్షియం సమృద్ధిగా లభించే వనరు. గుండెజబ్బుల నుండి కాపాడే ఒమెగ-3 ఫాటీ(పాలీ అన్ సాచురేటెడ్) యాసిడ్స్ ను చేప కలిగియుంటుంది. తృణధాన్యాధార ఆహారములోని కాయధాన్యాలకు బదులుగా పేదప్రజలు చేపను తినవచ్చు. చేపల మీద ఇష్టం ఉన్నవారు రోజుకు సుమారు 100-200గ్రాముల చేపను తీసుకోవచ్చు. చేప యొక్క పోషకాహార వాస్తవాలు జంతుమాంసకృత్తులకు ఇవి మంచి ఆధారవనరు. క్రొవ్వును కరిగించే విటమిన్ అ మరియు విటమిన డి పెద్ద చేపల నూనెలో కేంద్రీకరించబడియుంటాయి. రక్తనాళాలవ్యాధులను నియంత్రించటంలో ప్రధానపాత్ర పోషించే ఒమెగా-3ఫాటీయాసిడ్స్ కు చేప ఒక సమృద్ధమైన వనరు. విటమిన్ బి కాంప్లెక్స్ ముఖ్యంగా నికోటినిక్ యాసిడ్ మరియు విటమిన్ సి పచ్చిచేపలో లభ్యమవుతాయి కానీ వండినాక చాలా వరకునాశనమౌతాయి. సముద్రపు చేప మరియు గుల్లచేప లో అయోడిన్,ఫ్లోరైడ్ సమృద్ధిగా లభిస్తాయి. కవడులు,మరియు నత్తగుల్ల గుడ్ల లాంటిచిన్న చేపలను ముళ్ళతో సహామొత్తంగా 100 గ్రాములు తింటే 400 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. పెద్దపెద్ద చేపలలో ఇనుము,భాస్వరము సమృద్దిగా ఉంటాయి కానీ కాల్షియం తక్కువగా ఉంటుంది. ఆల్చిప్ప లలో జింకు(తుత్తునాగం) అత్యంతసమృద్దంగా లభిస్తుంది, ఇవి ప్రతి వందగ్రాములకు గాను వంద మిల్లీ గ్రాముల జింకు కలిగియుంటాయి. చేప నూనెలలో లభించే విటమిన్లు చేప నూనె 1 టీ స్పూన్=5గ్రాములు విటమిన్ ఎ విటమిన్ డి కాడ్ లివర్ ఆయిల్ 1000-2000 ఐ యు లేదా 350 ఐ యు లేదా 8.8 మైక్రోగ్రాములు 333-666 మైక్రోగ్రాములు (రెటినాల్) షార్క్ లివర్ ఆయిల్ 1000 ఐ యు లేదా 100 ఐ యు లేదా 333 మైక్రోగ్రాములు (రెటినాల్) 2.5 మైక్రోగ్రాములు చేపలు మరియు వ్యాధులు సక్రమంగా శుభ్రం చేయని, భద్రపరచని చేపలవల్ల జీర్ణాంగానికి సంబంధించిన సమస్యలు మరియు అతిసార కలగవచ్చు. గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు - చేప చేపలో తక్కువగా అంతర కణజాలముండటం వల్ల తక్కువసమయములోనే వండవచ్చు. చేపనువండిన నీటిని పారబోసినయెడల పోషకాలను కోల్పోతాము. చేపను వెనిగర్ తోఉడికించినచో ముళ్ళు మెత్తగాతయారై తినగలము,తద్వారా అధికంగా కాల్షియం అందుతుంది వేయించిన చేపల్లోని కొవ్వు వల్ల అధికశక్తిని అందిస్తుంది. ఎవరయినా ఉప్పును ఆహారములో పరిమితంగా తీసుకొమ్మని సలహా పొందినట్లైతే వారు ఎండు/ఉప్పు చేపలను తక్కువగా తీసుకోవాలి/అసలుపూర్తిగా మానెయ్యాలి. మాంసం మాంసం అనగా సాధారణంగా ఆహారముగా ఉపయోగించే జంతుకణజాలం.సహజంగా అస్తికలకుండేకండరాలు, దానికి అనుబంధించిఉండే కొవ్వును మాంసం అని వ్యవహరిస్తారు. కానీ పశువుల అవయవాలు, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మము, మెదడు, ఎముకమూలుగు, మూత్రపిండాలు, మరియు నానావిధాలైన లోపలి అంగాలను కూడా మాంసం అనే అంటారు. మాంసం యొక్క పోషకాహార వాస్తవాలు. పిండిపదార్థాలు: మాంసం లో పిండిపదార్ధాలు తక్కువగా ఉంటాయి అలాగే పీచు పదార్ధం కూడా ఉండదు. మాంసకృత్తులు : - మంచి నాణ్యమైన మాంసకృత్తులకు గణనీయమైన అధారవనరు క్రొవ్వు: జంతువులను బట్టి వాటి జాతిని బట్టి క్రొవ్వు శాతం మారుతుంటుంది,సాధారణంగా కొవ్వుతక్కువగా ఉన్న వాటిలో2 to 5 శాతం పెంపకంలో పాటించిన పద్ధతులు,వాటి మేతతీరుతెన్నులు,మరియు జంతువుల యొక్క వయసుమీద ఆధారపడిఉంటాయి. మెత్తం మీద కనిపించే క్రొవ్వుతీసివేస్తే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. మొత్తం క్రొవ్వుకు కండరాలలోని క్రొవ్వు కొ్ద్దిమోతాదులో జోడవుతుంది. కోడిమాంసములోచర్మములో దాదాపు 48 శాతం క్రొవ్వు ఉంటుంది.వండేందుకు ముందు ఈ చర్మాన్ని తొలగిస్తే ఆమేరకు క్రొవ్వు తగ్గుతుంది. కోడిమాంసములో 30 శాతం సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పంది, గొడ్డు,గొర్రెపిల్ల మాంసాలలో 50 శాతం సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సూక్ష్మపోషకాలు: మాంసం జింకు,విటమిన్ బిB12, సెలీనియం,ఫాస్ఫరస్,నియాసిన్,విటమిన్ బి6,ఐరన్ మరియు రైబోఫ్లోవిన్ కు మంచి ఆధారవనరు. మాంసం నుంచి లభించే ఐరన్/ఇనుము మొత్తం తక్షణం విలీనమవుతుంది. మాంసానికి సంబంధించిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు సరిగ్గా ఉడికించని పందిమాంసం కొన్నిసార్లు ట్రిచినోసిస్,సిస్టిసర్కాసిస్ అనే రుగ్మతలను కలిగించే పరాన్న జీవులను కలిగిఉంటాయి కోడిమాంసం లో తరచుగా సాల్మొనెల్ల ఎంటెరికా అనేవ్యాధిని కలుగజేసే సూక్షజీవులుంటాయి. మనము తీసుకునే ఆహారములో జంతు ఉత్పత్తులు ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యప్రయోజనాలు అంత ఎక్కువగా ఉంటాయని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. శాఖాహారం-ఒక సురక్షితమైన పౌష్టికాహారం మొక్కలమీద ఆధారపడ్డ లేదా శాఖాహారం వ్యాధులబారినుంచి తప్పించటంలో మరియు ఆరోగ్యాన్ని పెంపొందించటానికి దోహద పడుతుంది. సమతుల్యమైన శాఖాహారములో క్రొవ్వు ముఖ్యంగా సంతృప్త క్రొవ్వు,కెలెస్టరాల్ తక్కువగా ఉంటాయి. విటమిన్ బి12 మినహా మొక్కల నుండి సంగ్రహించగల అన్ని యితర పోషకాలతో పాటు ఆహారాన్ని సంరక్షించే పోషకపదార్ధాలు.యాంటీ-ఆక్సిడెంట్లు,మరియు పీచు పదార్ధాలు శాఖాహారములో ఉంటాయి. భోజనములో పాలను కూడా కలిపినట్లైతే శాఖాహారభోజనము సంపూర్ణ భోజనము/ఆహారము అవుతుంది ఇటీవలి కాలములో ఈస్ట్రోజన్లు,క్రిమిసంహారకాలు పప్పధాన్యాలు,గింజల్లో కన్నా ఎక్కువగా మాంసములో ఉంటున్నాయి,నీటితో శుభ్రం చెయ్యటం ద్వారా శాఖాహార ఉత్పత్తులలో మనము క్రిమిసంహారకాలను తొలగించవచ్చు, కానీ ఇది మాంసం విషయములో సాధ్యము కాదు. శాఖాహారాన్ని తీసుకునేందుకు చాలా మార్గాలున్నాయి. అర్ధశాఖాహారులు కొన్నిటిని మాత్రం మినహాయిస్తారు కానీ అన్ని జంతుఉత్పత్తులను కాదు,వారు సందర్భానుసారంగా కోడి,వేటమాంసాలు,చేపను తింటూనే ఉంటారు. కొందరు శాఖాహారులు పాలు,పాల ఉత్పత్తులు మరియు గుడ్లను తమ ఆహారములో తీసుకుంటారు కానీ,మాంసము,చేపలు,మరియి కోడిమాంసంను ముట్టరు. మరికొందరు (శుధ్ధ శాకాహారులు) – పాలు మరియు పాల ఉత్పత్తులను సహితం తినని వారు. ముఖ్యంగా జంతు ఉత్పత్తులలో సంపూర్ణ మాంసక్రత్తులు ఉండటం వలన గుడ్డు, చేప, పాలు లాంటివి పిల్లలకు, ముసలి వాళ్ళకు మరియు అనారోగ్యంనుండి బయట పడ్డవారికి తగినమేతాదులో ఆహారం లో కల్పించడం మంచిది. ఆఖరికి మాంసాహారాన్ని సేవించడం అనేది (వ్యక్తిగత అబిరుచిని బట్టి ఉంటుంది) అందునా ఆహారంలో – పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలను పుష్కలంగా తీసుకోవడం అనేది ఎప్పుడైనా మంచిది. గుర్తుంచుకోవాల్సిన ఆరోగ్యచిట్కా - మాంసం మరణానికి కారణమవుతున్న మూడు వ్యాధులు హృద్రోగం,కాన్సర్,గుండెపోటు ఆహారసంబంధమైనవేనని పరిశోధనలు తెలుపుతున్నాయి. మాంసకృత్తులతో ,సంతృప్త క్రొవ్వుపదార్ధాలు కూడా మాంసాహారం లొ విరివిగా ఉంటుంది, కొలెస్టరాల్ మాంసాహారం మరియు యితర జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది వినియోగాన్ని తగ్గించమని సూచిస్తున్నారు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు