పరిచయం బాగా వర్షాలు పడి తగ్గినా తరువాత, చలి ఎక్కువగా వున్నప్పుడు చాల మందిలో జలుబు, దగ్గుతూ కూడిన జలుబు మనం చూస్తూనే ఉంటాము. అయితే దీన్ని నివారించుకోవటానికి డి విటమిన్ మాత్రలుబాగా దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు కూడా. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్ డి రక్షణ కల్పిస్తుందన్నది తాజాగా రేగిన పరిశోధన లో తేట తెల్లమైంది. ఇటీవల బ్రిటనులోని క్విలిన్ మేరీస్ విశ్వా విద్యాలయం అఫ్ లండన్ (క్యూ యం యూ యల్) నిపుణులు నిర్వహించారు. భరత్, ఆఫ్ఘనిస్తాన్ సహా పధానాలుగు దేశాలకు చెందిన పదకొండు వేళా మంది సమాచారాన్ని వారు వివరించారు. ఎముకలు కండరాల ఆరోగ్యానికి, విటమిన్ డి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే వూపిరి తిత్తుల్లోని యాంటీ మైక్రో బయాల్ పేపరైడ్ స్థాయిని పెంచడం ద్వారా శ్వాస సంబంధించి ఇన్ఫెక్షన్లను ఇది అడ్డుకోగలడు. ఆస్తమా నుంచి రక్షణ కుడా విముక్తి కలిగే ఆస్కారం వున్నది అని పరిశోధకులు ఆండ్రియన్ మార్టినీవ్ పేర్కొన్నారు. ఎండ వేడి బాగా తక్కువగా వుండే శీతాకాలం, వర్షాకాలం లో జలుబు, శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ప్రబలే వీలుంటుందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఏమి అయినప్పటికీ సూర్య రశ్మి మనకు సోకితే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది అనేది తెలిసిందే. మలేరియాకి అడ్డుకునే టీకా గురించి. అత్యంత శక్తివంతమైన మలేరియా టీకాను పరిశోధకులు ఎంతగానో అభివృద్ధి చేసారు. పది వారాల పటు వంద శాతం సమర్ధంగా రక్షణ ఇప్పించడం దీని యొక్క ప్రత్యేకత. సనారియ పిఎఫ్ ఎస్ పి జడ్ సి వ్యాక్గా వ్యవహరిస్తున్న దిన్ని జర్మనీ లోని ట్యూబ్ఇంజెన్ విశ్వ విద్యాలయ నిపుణులు తయారు చేసారు. సనారియ పి ఎఫ్ ఎస్ పి జడ్ సి వ్య్కగా వ్యవహరించే దిన్ని జర్మనీలోని ట్యూబ్ఇంజన్ విశ్వా విద్యల నిపుణులు తయారు చేసారు. పలువురు ఆరోగ్యవంతులపై ప్రాధమిక పరీక్షలు కూడా నిర్వహించారు. ప్లాస్మోడియం ఫాల్సిఫెరం పరాన్న జీవి మలేరియా ఇన్ఫెక్షన్ కి కారకమైన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆడ ఎనాఫిల్స్ దోమల కారణంగా మానవులకు వస్తుందిట. గతంలో నివారణకు ఔషధాలు, టీకాలు పరిశోధకులు తయారు చేసారు కూడా. అయితే అవి మలేరియాను తగ్గించడం లో చాల వరకు విఫలం అయినాయి. తాజా టీకాను మూడు సార్లు తీసుకుంటే మలేరియా పరాన్న జివి యిట్టె నియంత్రించ వచ్చని పీటర్ క్రామ్స్ నర్ అనే పరిషకుడు అంటున్నారు. రెండు టీకాల మధ్య అయితే మూడు నుంచి నాలుగు వారా పాటు సమయం ఉంటే మంచిదని అంటున్నారు. వ్యాసం... అనూరాధ